ముగిసిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు… హాజరైన సిఎం జగన్

Clock Of Nellore ( Udayagiri ) – నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో మంత్రి గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల మధ్య ముగిశాయి. మేకపాటి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. పార్థివదేహానికి ముఖ్యమంత్రి జగన్ పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కడసారి తమ ఆత్మీయుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. చివరి పూజా కార్యక్రమాల తర్వాత గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి చితికి నిప్పు అంటించారు. అశేషంగా తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో అంత్యక్రియల ప్రాంగణం కిక్కిరిసింది.

అంతిమ యాత్ర సాగిందిలా…
నెల్లూరులోని డైకాస్ రోడ్​ వారి నివాసం నుంచి ఈరోజు ఉదయం 6 గంటలకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా అంతిమయాత్ర సాగింది. తమ అభిమాన నాయకుడుకి కడసారి చూసేందుంకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ప్రజలు తరలివచ్చారు. దారిపోడవున అశ్రునయనాలతో నివాళులర్పించారు. జోహార్ మంత్రి మేకపాటి, మెట్ట ప్రాంత ముద్దుబిడ్డ అమర్ రహే, అన్నా గౌతమన్నా అంటూ నినాదాలు చేస్తూ… బాధాతప్త హృదయంతో… తడారని కళ్లతో ఆయనకు వీడ్కోలు పలికారు.

Read Previous

నెల్లూరు నుండి ఉదయగిరికి మంత్రి మేకపాటి అంతిమ యాత్ర రూట్ మ్యాప్

Read Next

యూనివర్శిటీ అభివృద్ధికి కృషి చేయండి – ఎంపి ఆదాలను కోరిన రిజిస్ట్రార్

Leave a Reply

Your email address will not be published.