కిడ్నీ వ్యాధులపై అప్రమత్తత అవసరం : అపోలో వైద్యుల హెచ్చరిక

Clock Of Nellore ( Nellore ) – World Kidney Day ను 2026 మార్చి 12న “అందరికీ కిడ్నీ ఆరోగ్యం – ప్రజల సంరక్షణ, భూమి రక్షణ” అనే థీమ్‌తో నిర్వహించనున్నారు. ఈ రోజు కిడ్నీ వ్యాధుల పెరుగుతున్న సమస్యపై అవగాహన పెంచడం మరియు తొందరగా గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే లక్ష్యంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా గురువారం నాడు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ AK చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వలీ, డాక్టర్ రాకేష్ మరియు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి లు పాల్గోన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరికి క్రానిక్ కిడ్నీ వ్యాధి ఉండే అవకాశం ఉంది మరియు ఇది ప్రారంభ దశల్లో లక్షణాలు లేకుండా ఉండొచ్చు. నియమిత ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, డయాబెటిస్ మరియు రక్తపోటు నియంత్రణ కిడ్నీ వ్యాధి నివారణకు చాలా ముఖ్యమైనవి. ఈ సంవత్సరం థీమ్ అందరికీ సమానంగా కిడ్నీ చికిత్స అందుబాటులో ఉండడం మరియు పర్యావరణానికి అనుకూలమైన వైద్య విధానాల అవసరాన్ని కూడా ప్రస్తావిస్తుంది. ప్రజలు తమ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవగాహన పెంచుకుని, నిరోధక చర్యలు తీసుకుని, అవసరమైనప్పుడు వైద్య సహాయం పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read Previous

ప్రతీ ఒక్క బాలిక HPV వ్యాక్సిన్ వేసుకోవాలి : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పిలుపు

Read Next

నెల్లూరు హైవే పక్కనే అదిరిపోయే సౌకర్యాలు : సిఎంకు వివరించిన కలెక్టర్ శుక్లా

Leave a Reply

Your email address will not be published.