అంచనాల కమిటి సభ్యునిగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

Clock Of Nellore ( Gudur ) – అసెంబ్లీలో మూడు ఆర్ధిక కమిటీలకు నూతన ఛైర్మైన్లను, సభ్యులను స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియమించారు. ప్రజా పద్దుల కమిటితో పాటూ అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు ఛైర్మైన్లతో పాటూ సభ్యులను నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి ఒకరికి అవకాశం లభించింది. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కు అంచనాల కమిటీలో స్థానం లభించింది. ఆయన అంచనాల కమిటీలో సభ్యునిగా నియమితులైనారు. దీనిపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Read Previous

ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి కోసమే పార్టీ మారాం : మాజీ మంత్రి కాకాణిపై రూప్ ధ్వజం

Read Next

అమ్మవారి అలంకరణతో తల్లి మొక్కు తీర్చిన తనయుడు

Leave a Reply

Your email address will not be published.