Clock Of Nellore ( Nellore ) – ఎన్నికల నేపద్యంలో గత మూడు నెలలుగా నిలిచిపోయిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. గతంలో స్పందనగా ఉన్న పేరును ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మార్చింది. సమస్య 100 శాతం పరిష్కారం అయ్యేలా నూతనంగా రూపొందించిన ప్రజా సమస్యల పరిష్కార వేదక కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ హరినారాయణన్ అర్జీలను స్వీకరించారు. అలాగే నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ వికాశ్ మర్మత్ కూడా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. త్వరితగతిన సమస్యలకు పరిష్కారం చూపుతామంటూ హామీ ఇచ్చారు.

Tags: Nellore Collector Hari Narayanan Nellore Commissionar IAS Vikas Marmat Praja samasyala Parishkara Vedhika Public Greevence