ప్రతీ ఓటు కీలకమే… జాగ్రత్తగా పనిచేయండి : కార్పొరేటర్లకు విజయసాయి దిశానిర్ధేశం

Clock Of Nellore ( Nellore ) – ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి… పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న పోరు ఇది… ప్రతీ ఓటు చాలా కీలకం… జాగ్రత్తగా పనిచేయాలంటూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని వైసీపి కార్పొరేటర్లకు దిశా నిర్ధేశం చేశారు ఎంపి అభ్యర్ధి విజయసాయిరెడ్డి. పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, సిటీ అభ్యర్ధి ఖలీల్ అహ్మద్ తో కలిసి ఆయన శనివారం సాయంత్రం కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను వారితో చర్చించారు. ప్రతీ ఓటు కీలకమని, ఏమరుపాటు వద్దని హెచ్చరించారు. వీలైనంత సమయం ఓటర్లతో గడిపి వారిని వైసీపి వైపు మొగ్గు చూపేలా ప్రయత్నం చేయాలన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా కార్పొరేటర్లకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచలరెడ్డి కూడా పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరు జిల్లాలో 3వ రోజు 9 నామినేషన్లు : సర్వేపల్లిలో ఇప్పటి వరకూ నిల్

Read Next

మిగిలింది 22 రోజులే… గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం : వింజమూరులో విపిఆర్ పిలుపు

Leave a Reply

Your email address will not be published.