Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నుండి కృష్ణపట్నం వెళ్లే పంట కాలువకు రెండు వైపులా గోడ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. నెల్లూరు నగర పరిధి వరకూ నిర్మించే ఈ గోడ నిర్మాణ పనులకు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ మంగళవారం గుర్రాల మడుగు సంఘం వద్ద శంఖుస్థాపన చేశారు. ఈ గోడ నిర్మాణం వద్ద గుర్రాల మడుగు, దానికి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి కాలువ నుండి రక్షణ ఉంటుందని అన్నారు. త్వరితగతిన పనులు పూర్తవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, వైసీపి నేతలు గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి, బాలాజీ నగర్ సిఐ మధుబాబు పాల్గొన్నారు.
