నెల్లూరుజిల్లాలో ఇద్దరు ఏఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి…

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ( Nellore Police ) . నెల్లూరు జిల్లాకు సంభందించి ఇద్దరు అదనపు ఎస్పీలు ఎస్పీలుగా పదోన్నతి పొందారు. ఈ ఏడాది మే నెలలో జిల్లా అదనపు ఎస్పీ ( అడ్మిన్ ) గా వచ్చిన డి. హిమవతి, నేర విభాగం అదనపు ఎస్పీగా వచ్చిన డి. చౌడేశ్వరి ఈ జాబితాలో ఉన్నారు. 2021 – 2022 సంవత్సరానికి గానూ పలువురు అదనపు ఎస్పీలను నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు పేర్లతో కూడిన జాబితాను హోం శాఖ ప్యానల్ కు పంపగా, ప్యానల్ ఆ జాబితాను ఆమోదించింది. ఎస్పీలుగా పదోన్నతి పొందిన అదనపు ఎస్పీలంతా ప్రస్తుతానికి అదే పోస్టుల్లో కొనసాగుతారు. తర్వాత వారికి కొత్తగా పోస్టింగులు కేటాయించనుంది ప్రభుత్వం.

Read Previous

సిఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కోటంరెడ్డి సోదరులు భేటీ…

Read Next

మంత్రి కాకాణికి ఆన్ లైన్ లోన్ రికవరీ ఏజెంట్ల ఫోన్… అరెస్ట్ చేసిన పోలీసులు

Leave a Reply

Your email address will not be published.