రాష్ట్రంలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు…

Clock Of Nellore ( Amaravathi ) – రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఏప్రిల్‌ 4వ తేదీన ఉదయం 9గం.05ని నుంచి 9గం.45ని.మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగనుంది. అప్పటి నుండే నూతన జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. ఈ మేరకు కొత్త జిల్లాలకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర పడింది. 26 జిల్లాల ఏర్పాటునకు గానూ వర్చువల్‌గా ఆమోదం తెలిపింది కేబినెట్‌. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్‌ విజయవాడ జిల్లాలు అమలులోకి రానున్నాయి.

పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్‌, గుంతకల్‌, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. నూతన జిల్లాలకు సంభందించి ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది.

Read Previous

ఉగాది తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం…

Read Next

నెల్లూరు కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం : వివిధ రంగాలకు కేటాయింపులు

Leave a Reply

Your email address will not be published.