Clock Of Nellore ( Gudur ) – ఉమ్మడి నెల్లూరుజిల్లా, ప్రస్తుత తిరుపతి జిల్లాలో కలిసిన గూడూరు పట్టణంలోని ఎగువ వీరారెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి ఇవ్వలేదన్న కారణంతో కొడుకు నరసింహులు తల్లి జ్ఞానమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. గూడూరు 2వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మద్యం మత్తులో హత్య చేసినట్లు ప్రాధమిక విచారణలో తేలినట్లు సమాచారం. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
