ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ : బారులు తీరిన మహిళా ఓటర్లు

Clock Of Nellore ( Atmakur ) – ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ లో మహిళా చైతన్యం స్పష్టంగా కనిపించింది. నియోజకవర్గంలోని 279 పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి మహిళా ఓటర్లు అధికంగా తరలివచ్చారు. తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏ పోలింగ్ బూత్ లో చూసినా మహిళా ఓటర్లే అధికంగా కనిపించారు. యువ ఓటర్లు కూడా అధికంగా ఉన్నారు. 

Read Previous

ఓటు హక్కు వినియోగించుకున్న మేకపాటి విక్రమ్ రెడ్డి

Read Next

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ను పరిశీలించిన కలెక్టర్ చక్రధర్ బాబు

Leave a Reply

Your email address will not be published.