గుర్తు తెలియని వాహనం ఢీ – నెల్లూరుజిల్లాలో చిరుత పులి మృతి

Clock Of Nellore ( Marripadu ) – గుర్తు తెలియని వాహనం ఢీ కొని నెల్లూరుజిల్లాలో చిరుత పులి మృత్యువాత పడింది. మర్రిపాడు మండలం, తిమ్మానాయుడుపేట అటవీ ప్రాంత ఘాట్ రోడ్డులో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి 7 గంటల ప్రాంతంలో చిరుత పులి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం దాన్ని ఢీ కొట్టింది. 8 గంటల ప్రాంతంలో అదే రోడ్డులో స్థానికులు వెళుతూ చిరుత పులి రోడ్డుపై చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకుని పులి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Read Previous

మండల విద్యాధికారిపై ఎమ్మెల్యే కాకాణి ఆగ్రహం… చర్యలు తప్పవని హెచ్చరిక

Read Next

ఏప్రిల్ 11 నుంచి గడప గడపకూ కోటంరెడ్డి… రూట్ మ్యాప్ సిద్దం…

Leave a Reply

Your email address will not be published.