WSO డైరెక్టర్ గా డాక్టర్ బింధు మీనన్ : అభినందించిన అపోలో హాస్పిటల్స్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ బింధు మీనన్ వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ బోర్డు ( WSO ) డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. నాలుగేళ్ల పాటూ ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. దీనికి తోడు అదనంగా 2024 పాలట్టుక్కి అడ్వ‌క‌సీ లీడర్‌షిప్ ఫోరమ్‌లో స‌ల‌హాదారులుగా నియ‌మితుల‌య్యారు. ఫోరమ్ నిర్వాహకులు ఆమెను స్వాగతించడంలో సంతోషంగా ఉన్నారు, ఆమె కొత్త అడ్వకేట్ క్లాస్‌తో తన అడ్వకేసీ అనుభవాలను పంచుకోవడానికి, సలహాదారిగా, డాక్టర్ బింధు మీనన్ అధునాతన నాయకత్వ – అభివృద్ధి శిక్షణలో పాల్గొనాలని, అడ్వకేసీ ప్రయత్నాలలో తమ సహచరులను కోచ్ చేయడానికి మరియు ప్రేరేపించడానికి వ్యూహాలను సంపాదించాలని బోర్డు ఆమెను కోరింది. ఈ శిక్షణ సమయంలో 2024 అడ్వకేట్ క్లాసు రూపకల్పనను సమీక్షించి, ఆమెకు ఆన్‌సైట్ డ్యూటీలు నిర్వహించడానికి సన్నద్ధమవుతారు. ఈ సందర్బంగా నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆసుపత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మరియు ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు లు పాల్గొని ఆమెను అభినందించారు.

Read Previous

అక్షర శిల్పి రామోజీకి ఘన నివాళులు : ఆదివారం అంత్యక్రియలు

Read Next

హుందా రాజకీయాలకు నిలువుటద్దం నారాయణ సార్ : ప్రసంశించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.