Clock Of Nellore ( Kovur ) – కోవూరులో పాకనాటి అయ్యప్ప అనే వ్యక్తి దారుణ హత్యకు గురైనాడు. ఇంట్లోనే మంచంపై చనిపోయి ఉండగా కుటుంబసభ్యులు గుర్తించారు. తలపై బలమైన గాయం ఉంది. గత అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యే హత్య చేసి ఉంటుందని అయ్యప్ప సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాహేతర సంభందం నేపద్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ డిఎస్పీ వీరాంజనేయరెడ్డి, కోవూరు సిఐ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య దుర్గను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో ఆమే ఉందని నిర్ధారించుకున్నారు.