Clock Of Nellore ( Jonnawada ) – నెల్లూరుజిల్లా వాసి, వైసీపి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కుటుంబసభ్యులు జొన్నవాడలోని శ్రీ మల్లిఖార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. విజయసాయి రెడ్డి సతీమణి సునందా రెడ్డి, కుమార్తె నేహా, ఇతర కుటుంబసభ్యులు ఆదివారం ఆలయానికి వెళ్లగా ఈఓ వెంకటేశ్వర్లు, ఆలయ ఛైర్మైన్ పుట్టా లక్ష్మి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మనమడు, మనుమరాలికి తల నీలాలు తీయించారు. అనంతరం అమ్మవారికి దర్శించుకున్నారు. అమ్మవారికి నవావరణ పూజలు, నవగ్రహ శాంతి పూజలు చేశారు.