Clock Of Nellore ( Amaravathi ) – ఏపిలో గత ఐదేళ్లుగా సాగిన జగన్ సర్కారులో కొనసాగిన ప్రభుత్వం మద్యం దుకాణాలు రద్దయ్యాయి. మద్యం విక్రయాలను రిటైల్ షాపులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంభందించి రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ను జారీ చేయడంతో దానికి అనుగుణంగా ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుండి మద్యం విక్రయాలను రిటైల్ షాపులకు అంటే ప్రైవేటుకు అప్పగించనున్నారు. ప్రస్తుత మద్యం పాలసీ ఈనెల 30వ తేదీతో ముగియనుంది. 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీ అమలు కానుంది. ఇక నుండి రాష్ట్రంలో ప్రైవేటు లిక్కర్ షాపులే ఉంటాయి.