నిన్న చేరి… నేడు మారి… కోవూరులో చిత్రం… భళారే విచిత్రం….

Clock Of Nellore ( Nellore ) – కోవూరు నియోజకవర్గంలో వైసీపికి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడుతున్నారు. నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి జై కొడుతున్నారు. ఇప్పటికే అనేక మంది నేతలు వైసీపికి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరగా తాజాగా కీలకమైన బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ కూడా వైసీపికి రాం రాం చెప్పారు. భర్త మోర్ల మురళి, 14వ వార్డు కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ తో కలిసి టిడిపి నెల్లూరు ఎంపి అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని వారి నివాసంలో కలిశారు. ప్రశాంతి రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వారికి వేమిరెడ్డి దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటి అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్ఠి సారిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ సుప్రజ మాట్లాడుతూ ఈనెల 13న జరిగే ఎన్నికల్లో కోవూరు ఎమ్మెల్యే స్థానం నుండి పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రం టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరో వైపు నిన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ ఇవాళ వైసీపి నేతల ప్రచారంలో దర్శనమిచ్చారు. తిరిగి ఆమె వైసీపి గూటికి వెళ్లినట్లు తెలుస్తోంది.

Read Previous

ఇది కాదా… అభివృద్ధి అంటే : నెల్లూరు సభలో చంద్రబాబుపై జగన్ ఫైర్

Read Next

నెల్లూరు రూరల్ బిగ్ న్యూస్ : టిడిపిలో చేరిన వైసీపి రాష్ట్ర అధికార ప్రతినిధి జి.వి. ప్రసాద్

Leave a Reply

Your email address will not be published.