నెల్లూరు రూరల్ బిగ్ న్యూస్ : టిడిపిలో చేరిన వైసీపి రాష్ట్ర అధికార ప్రతినిధి జి.వి. ప్రసాద్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. అత్యంత వ్యూహాత్మక ఎత్తుగడలతో కోటంరెడ్డి సోదరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఖాళీ చేయించే పనిలో నిమగ్నమయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎన్ ఎస్ యూ ఐ లో సుదీర్ఘకాలం పనిచేసిన జీవి ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ టిడిపి అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సమక్షంలో ఆదివారం ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరారు.

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ కండువా వేసి జీవి ప్రసాద్ ను ఆహ్వానించారు. టిడిపి కోసం క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జీవి ప్రసాద్ మాట్లాడుతూ గత 29సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడి పనిచేసిన కనీస గుర్తింపు లేదన్నారు. ఇక కొనసాగలేక తెలుగుదేశం పార్టీలో వేమిరెడ్డి, కోటంరెడ్డి సమక్షంలో పార్టీలో చేరానన్నారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Read Previous

నిన్న చేరి… నేడు మారి… కోవూరులో చిత్రం… భళారే విచిత్రం….

Read Next

వైసీపికి గుడ్ బై చెప్పిన సూరిశెట్టి బ్రదర్స్ : నారాయణ సమక్షంలో టిడిపిలో చేరిక

Leave a Reply

Your email address will not be published.