Clock Of Nellore ( Nellore ) – నెల్లూరును గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం అని నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపి అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. నగరంలోని ఆర్.ఎస్.ఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్, ఏసీ సుబ్బారెడ్డి పార్కులను గురువారం ఉదయం పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. అక్కడ వ్యాయామం చేస్తున్న వారితో, వాకర్స్ తో ముచ్చటించారు. పార్కులు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి, ఇందులో భాగంగా నెల్లూరు నగరంలో ప్రజారోగ్యం, పారిశుధ్యంపై ప్రత్యక దృష్టి పెట్టి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే నా ధ్యేయమని విజయసాయిరెడ్డి తెలిపారు. సుప్రభాత వేళ నెల్లూరు నగర వీధులు ఖాళీగా, చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయని విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్డులో ఉన్న కోమల విలాస్, నర్తకీ థియేటర్ వద్ద టీ దుకాణాలను సందర్శించి కాఫీ సేవిస్తూ స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విజయసాయిరెడ్డి తో పాటు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.