నేడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టిన రోజు : కుటుంబంతో శ్రీవారిని దర్శించుకున్న విపిఆర్

Clock Of Nellore ( Tirumala ) – తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ప్రముఖ పారిశ్రామిక వేత్త, నెల్లూరు పార్లమెంటు టిడిపి ఎంపి అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. శుక్రవారం తెల్లవారు జామున విఐపి బ్రేక్ సమయంలో సతీమణి, కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. వీరితో పాటూ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కుమారుడు డాక్టర్ అర్జున్ రెడ్డి దంపతులు, కుమార్తె నీలిమా రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. ప్రతీ ఏడాది తన పుట్టిన రోజున స్వామి వారిని దర్శించుకోవడం తనకు ఆనవాయితీగా వస్తుందని, స్వామి దర్శనం అద్భుతమన్నారు. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు విపిఆర్ దంపతులు పేర్కొన్నారు. అనంతరం వారు నెల్లూరుకు చేరుకున్నారు.

Read Previous

టిడిపిలో చేరిన వైసీపి ముఖ్య నేతలు : కీలక నేతలూ రానున్నారన్న కోటంరెడ్డి

Read Next

వైసిపిలో చేరిన మనుక్రాంత్ రెడ్డి : కండువా కప్పి ఆహ్వానించిన సిఎం జగన్

Leave a Reply

Your email address will not be published.