టిడిపిలో చేరిన వైసీపి ముఖ్య నేతలు : కీలక నేతలూ రానున్నారన్న కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న కొందరు రెండు మూడు రోజుల్లోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. వైసీపిలో ముఖ్య నేతలుగా ఉండి, ఆపార్టీకి రాజీనామా చేసి వచ్చిన కొందమంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కోటంరెడ్డి పసుపు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 29వ డివిజన్ వైసీపి మాజీ కార్పొరేటర్ పావళ్ల మాధవి, ఆమె భర్త పావళ్ల ప్రసాద్ టిడిపిలో చేరారు. వారితో పాటూ శ్రీరాములు రెడ్డి, డాక్టర్ హరీష్, శ్రీనివాసులు రెడ్డి, గంగయ్య, శ్రీనివాసులు కూడా టిడిపిలో చేరారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు నడవడి ముత్యం గౌడ్ కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. వచ్చే నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని ఈ సందర్బంగా పార్టీలో చేరిన నేతలు హామీ ఇచ్చారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంభందించిన వైసీపిలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న పలువురు రెండు మూడు రోజుల్లో టిడిపిలో చేరబోతున్నారని, వచ్చే నెల 13 నాటికి రూరల్ నియోజకవర్గంలో వైసీపి ఖాళీ కాబోతుందని కోటంరెడ్డి తెలియజేశారు.

Read Previous

వచ్చేది వైసీపి ప్రభుత్వమే… డౌటే లేదు – స్పష్టం చేసిన విజయసాయి రెడ్డి

Read Next

నేడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టిన రోజు : కుటుంబంతో శ్రీవారిని దర్శించుకున్న విపిఆర్

Leave a Reply

Your email address will not be published.