Clock Of Nellore ( Kasumuru ) – నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులోని మస్తాన్ వలీ దర్గాను బుధవారం రాత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. దర్గా మత పెద్దలతో కలిసి దర్గాకు వెళ్లిన మంత్రి చాదర్ ను దర్గాపై ఉంచి ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం అక్కడ జరిగిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు.
