పొట్టేపాళెం కలుజు వద్ద బిజేపి నిరసన : కోటంరెడ్డి జలదీక్షకు మద్దతిస్తామని ప్రకటన

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని పొట్టేపాళెం కలుజు వద్ద భారతీయ జనతా యువమోర్చా ( BJYM ) నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎన్.కె. యశ్వంత్ సింగ్ ఠాకూర్ నిరసన తెలియజేశారు. BJYM నేతలతో కలిసి బుధవారం కలుజు వద్దకు చేరుకుని నీళ్లలో కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనదారులకు ప్రమాదకరంగా మారిన ఈ కలుజుపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. నిత్యం కలుజులో నీటి ప్రవాహం సాగుతూనే ఉందని, ఆ నీటి ప్రవాహంలోనే వాహనాలు ప్రయాణించాల్సి ఉందన్నారు. కలుజులో పాచి కారణంగా వాహనాలు జారి పడి చోదకులు గాయాలపాలవుతున్నారని యశ్వంత్ సింగ్ వెల్లడించారు. ఇప్పటికే అనేక మంది ఈ కలుజు కారణంగా ప్రమాదాలకు గురైనారన్నారు. గురువారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే జలదీక్షకు మద్దతు ప్రకటించారు. ప్రజా సమస్యలపై ఎవరు పోరాటాలు చేసినా మద్దతిస్తామని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమం అనంతరం జాయింట్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా కార్యదర్శి హర్షవర్ధన్, కోశాధికారి సాయి, బుచ్చి యువమోర్చా అధ్యక్షులు పెంచల కృష్ణ, బిజేపి నేతలు రాము తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరులో ఘనంగా బాబూ జగజ్జీవన్ రాం జయంతి

Read Next

విషాదాంతంగా మారిన బాలిక కిడ్నాప్ ఘటన : తెలిసిన వారి పనేనని అనుమానం

Leave a Reply

Your email address will not be published.