Clock Of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 7వ తేదీనా నెల్లూరుకు రానున్నట్లు సమాచారం అందింది. అదే రోజు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె విహహం నెల్లూరులో జరగనుంది. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సిఎం జగన్ రానున్నట్లు జిల్లా అధికారులకు సూచన ప్రాయంగా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్, ఎస్పీ సిఎం రాక ఏర్పాట్లపై చర్చించారు. నగర శివారు కనుపర్తిపాడు ఉన్నత పాఠశాల మైదానాన్ని హెలిప్యాడ్ ఏర్పాటు కోసం పరిశీలించారు. అయితే సిఎం పర్యటన అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు.