Clock Of Nellore ( Nellore ) – దివంగత నందమూరి తారకరామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మరణంపై సోషల్ మీడియాలో దుష్ ప్రచారం చేస్తున్న ఎంపి విజయసాయి రెడ్డి, వైసీపి నేత దేవంద్ర రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. దీనిపై నెల్లూరులో తెలుగుయువత అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ అమ్రుల్లా, తెలుగు మహిళ అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నందమూరి కుటుంబంలో జరిగిన ఆ విషాదంపై వారు సోషల్ మీడియా వేదికగా దుష్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.