Clock Of Nellore ( Gudluru ) – రామాయపట్నంలో ముఖ్యమంత్రి జగన్ సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని చిల్లకూరు మండలం, ఏరూరుకు చెందిన సైకత శల్పి మంచాల సనత్ కుమార్ భూమి పూజ జరిగే సమీపంలో సముద్ర తీరంలో సిఎం సైకత శిల్పాన్ని రూపొందించారు. సిఎం చిత్రాన్ని ఇసుకతో అందంగా తీర్చిదిద్దడమే కాకుండా థ్యాంక్యూ సిఎం సార్ అంటూ అక్షరాలను రూపొందించారు. భూమి పూజ అనంతరం సైకత శిల్పాన్ని చూపిన ముఖ్యమంత్రి జగన్ సనత్ కుమార్ ను ప్రత్యేకంగా పిలిచి అభినందించారు.
