Clock Of Nellore ( Tirumala ) – తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. తన లేటెస్ట్ మూవీ “థడక్” విజయవంతం కావాలని స్వామి వారిని కోరుకున్నట్లు కంగనా తెలిపారు. కంగనా నటించిన “థడక్” సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.