Clock Of Nellore ( Delhi ) – ఉగాది వేడుకలు, పార్లమెంటు సమావేశాల ముగింపును పురస్కరించుకుని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలోని తన నివాసంలో ఎమ్పీలకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు అందరు ఎమ్పీలు హాజరయ్యారు. నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్పీ గురుమూర్తి కూడా హాజరయ్యారు. వెంకయ్యనాయుడు దంపతులతో మాట్లాడారు. జిల్లాల విభజనపై కాసేపు చర్చించారు. ప్రత్యేకించి తిరుపతిలో కలిసిన నెల్లూరుజిల్లాలోని నియోజకవర్గాల గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.