Clock Of Nellore ( Amaravathi ) – అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అమరావతిలోని సిఎం ఛాంబర్ వద్ద నెల్లూరుజిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, ఆయన సతీమణి… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సిఎం వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కొద్ది సేపు వారితో మాట్లాడారు. తమ కుటుంబానికి అండగా ఉన్నందుకు ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి, ఆయన సతీమణి సిఎంకు ధన్యవాదాలు తెలియజేశారు.
