Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 12వ డివిజన్ లోని ధనలక్ష్మీ పురం కృషి నగర్ లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నాడు – నేడు రెండవ విడతలో భాగంగా జరుగుతున్న తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఒక కోటీ 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సౌకర్యవంతమైన తరగతి గదుల్లో విద్యార్థులకు అన్ని వసతులూ కల్పిస్తున్నామని, క్రమశిక్షణతో చదువుకుని రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులకు మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ సిపి నాయకులు, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

