బివిఎస్ బాలికల హైస్కూల్ ను అన్నీ విధాలా అభివృద్ధి చేస్తా… మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నవాబుపేటలో ఉన్న బివిఎస్ బాలికల హైస్కూల్ ను అన్నీ విధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. శనివారం సాయంత్రం హైస్కూల్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హైస్కూల్ విద్యార్ధినులు మంత్రికి థ్యాంక్యూ అనీల్ అన్న అంటూ ప్లకార్డులు ప్రదర్శించి స్వాగతం పలికారు. స్కూల్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. స్కూల్ కు అడ్డుగా, విద్యార్ధినులకు అసౌకర్యంగా ఉన్నందునే బయట ఉన్న దుకాణాలను తొలగించామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. అనంతరం ఆయన నెల్లూరు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండ్ వద్ద నూతనంగా నిర్మించిన స్వచ్ఛ మరుగుదొడ్లను కమిషనర్ దినేష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్లు కిన్నెర మాల్యాద్రి, మొగళ్లపల్లి కామాక్షిదేవి, షేక్ అస్మ, వైసీపి నేత సన్నపురెడ్డి పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ఉద్యోగుల సమ్మె సైరన్ పై అప్రమత్తం… ముందస్తు చర్యలపై కలెక్టర్ సమీక్ష

Read Next

గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత… రెండు రోజులు సంతాప దినాలు

Leave a Reply

Your email address will not be published.