Clock Of Nellore ( Tadepalli ) – ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో మర్యాద పూర్వకంగా కలిశారు. సిఎంకు పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలియజేశారు. ఉప ఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన సోదరుడు, దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని స్పష్టం చేశారు. విక్రమ్ రెడ్డితో పాటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు.