Clock Of Nellore ( Nellore ) – ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం (World Diabetes Day) జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రజలలో, వైద్య సిబ్బందిలో మరియు వైద్యులలో మధుమేహంపై అవగాహన పెంపొందించడం అత్యంత ముఖ్యమైనది. ఈ సందర్బంగా అపోలో అసుపత్రిలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆసుపత్రి డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు రెడ్డి, ప్రముఖ ఎండోక్రైనాలజిస్టులు డాక్టర్ సర్ఫరాజ్, డాక్టర్ యం.వి రామ్మోహన్ లు పాల్గొని మధుమేహం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధుమేహం (Diabetes) ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధులలో ఒకటి. అధిక బరువు (Obesity), వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, మరియు వంశ పారంపర్య ప్రభావం వంటి అంశాలు మధుమేహానికి ప్రధాన కారణాలు. మధుమేహం ఉన్నవారిలో రక్తపోటు (Hypertension), హృద్రోగాలు (Cardiovascular diseases) మరియు కిడ్నీ, కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అత్యంత అవసరం.
మధుమేహం నివారణ కోసం ముఖ్యమైన సూచనలు:
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలి.
తక్కువ చక్కెర, తక్కువ కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవాలి.
బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
రక్త చక్కెర, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తరచుగా పరీక్షించుకోవాలి.
వైద్యుల సలహాతో మధుమేహంపై సరైన జ్ఞానం మరియు చికిత్స పొందాలి.
ఈ ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా, ప్రతి వైద్యుడు, నర్సు, మధుమేహ శిక్షణకారుడు (Diabetes Educator) మరియు ప్రతి పౌరుడు కలిసి “ఆరోగ్యకరమైన జీవనశైలి – మధుమేహం రహిత జీవితం” అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి.ఈ సందర్బంగా అపోలో హాస్పిటల్స్ వారు ప్రపంచ డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2100/- రూ విలువైన పరీక్షలని కేవలం 699/-రూ మరియు 4500/-రూ విలువైన వైద్య పరీక్షలను కేవలం 1899/- కే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ పత్రికా విలేఖరుల సమావేశంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
