Clock Of Nelore ( Nellore ) – పిఎం ఈ బస్ సేవా పథకం ద్వారా నెల్లూరు నగరానికి ఈ – సిటీ బస్సులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 169 నగరాలకు మొత్తం 10వేల ఈ బస్సులను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. 3లక్షలకు పైబడి జనాభా ఉన్న ప్రతీ నగరానికి ఈ బస్సుల కేటాయింపు వర్తిస్తుందని కేబినెట్ వెల్లడించింది. దీని ప్రకారం నెల్లూరు నగరానికి కూడా బస్సులు కేటాయింపు జరగనుంది. నెల్లూరు నగర జనాభా 7 లక్షలకు పైబడి ఉంది. అయితే ఎన్ని బస్సులు కేటాయిస్తారో ఇంకా చెప్పలేదు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ బస్సులు నడపనున్నట్లు కేంద్రం తెలియజేసింది.
Reporter – P. Eswar