ఈనెల 18న కృష్ణపట్నం పోర్టులో సుకన్య నేవీ షిప్ : చూసేందుకు సందర్శకులకు అనుమతి

Clock Of Nellore ( Nellore ) – భారత నౌకాదళ దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత నేవీ షిప్ సుకన్య నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు రానుంది. ఈనెల 18న ప్రజల సందర్శనార్ధం ఆ షిప్ ను పోర్టులో ఉంచనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ సుకన్య షిప్ ను ప్రజలు చూసేందుకు భారత నేవీ దళ అధికారులు అవకాశమిచ్చారు. పాఠశాల, కళాశాల విద్యార్ధులతో పాటూ సాధారణ ప్రజలు కూడా ఈ నౌకను తిలకించవచ్చునని నేవీ అధికారులు తెలియజేశారు. భద్రతా కారణాల దృష్ఠ్యా మహిళలు హ్యాండ్ బ్యాగులు, పర్సులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.

Read Previous

చిన్నపాటి వర్షానికే నెల్లూరు అధ్వాన్నం : కేతంరెడ్డి ఆరోపణ

Read Next

మంత్రి రోజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పేర్నాటి

Leave a Reply

Your email address will not be published.