Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. 5వ డివిజన్ లోని వైకుంఠ పురంలో నాడు – నేడు ద్వారా 53 లక్షలతో చేపట్టనున్న స్కూల్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే బోడిగాడితోటలో 1.92 కోట్లతో ఏర్పాటు చేసిన గ్యాస్ ఆధారిత పార్ధీవ దేహాల దహన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, వేలూరు మహేష్, నీలి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
