Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని పెన్నానది తీరాన ఉన్న తిక్కన పార్కు ఆధునీకరణ పనులను నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ( Nellore Mla Anil Yadav ) సోమవారం సాయంత్రం పరిశీలించారు. 70 లక్షలతో చేపడుతున్న ఈ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పక్కనే ఉన్న పెన్నా బ్యారేజీని కూడా పరిశీలించారు. బ్యారేజీ ప్రారంభోత్సవం నాడే పార్కు కూడా ప్రారంభించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్ షేక్ అస్మ, కొణిదెల సుధీర్, కందుకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
