రైతులకు 80 శాతం సబ్సిడీతో కిసాన్ డ్రోన్లు : వెల్లడించిన జేసీ కార్తీక్
Clock Of Nellore ( Nellore ) - వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలని నెల్లూరుజిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ పిలుపునిచ్చారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వ్యవసాయంలో కిసాన్ డ్రోన్ల వినియోగం - ఉపయోగాలపై జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.