Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం సింహపురి మొదలియార్ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్కాట్ శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సర్వసభ్య సమావేశానికి మొదలియార్ కుటుంబాలకు చెందిన ప్రతీ ఒక్కరూ హాజరయ్యి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సింహపురి మొదలియార్ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు శనివారం కుక్కలగుంటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో విలేకరులతో మట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి ఆర్కాట్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం జరిగే సర్వసభ్య సమావేశానికి నెల్లూరులో ఉన్న ప్రతీ ఒక్క మొదలియార్ కుటుంబానికి చెందిన వారు హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు, మొదలియార్ కుటుంబాల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చిస్తామని ఆర్కాట్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు కీపూడి మురళి, కోశాధికారి కీపూడి షణ్ముగం, జాయింట్ సెక్రటరీ కీపూడి సుబ్రమణ్యం, కావేరి పాకం గణేష్ తదితరులు పాల్గొన్నారు.