Clock Of Nellore ( Nellore ) – ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శుక్రవారం సాయంత్రం నెల్లూరుకు చేరుకున్నారు. శనివారం నెల్లూరులో జరిగే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపద్యంలో ఓ ప్రైవేటు హోటల్ లో బసచేసిన హైకోర్టు న్యూయమూర్తిని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.