లారీని ఢీ కొట్టిన ఆటో… ఒకరు మృతి… పలువురికి గాయాలు

Clock Of Nellore ( kavali ) – నెల్లూరుజిల్లా కావలి సమీపంలోని గౌరవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. 12 మంది కావలి నుండి కొండ బిట్రగుంట ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గౌరవరం వద్ద ఎదురుగా వస్తున్న గేదెను తప్పించబోయి ముందు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది ఆటో. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న అందరూ గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయినట్లు పోలీసులు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని 108 ద్వారా కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృత్యువాత పడ్డారు.

Read Previous

ఆత్మకూరు ఎన్నికలకు పగడ్భందీ ఏర్పాట్లు – వెల్లడించిన సిఈఓ ముఖేష్ కుమార్

Read Next

ఆత్మకూరులో వైసీపి భారీ ర్యాలీ… రోజాతో సహా హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు

Leave a Reply

Your email address will not be published.