తిరుమల కొండపై విషాదం : చిరుత దాడిలో నెల్లూరు చిన్నారి మృతి
Clock Of Nellore ( Tirumala ) - తిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళెంకు చెందిన దినేష్, శశికళ దంపతులు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుమలకు బయలుదేరారు.