Clock Of Nellore ( Nellore ) – అమరావతి సచివాలయంలోని ఐదో బ్లాక్లో రెండు రోజుల పాటు జరిగే 6వ కలెక్టర్ల సదస్సు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఐటీ, క్వాంటం, ఏఐ వంటి రంగాల్లో కొత్త టెక్నాలజీలు, ల్యాబులు ఏర్పాటు చేస్తున్న తరహాలోనే వ్యవసాయానికి మరింత ఊతమిచ్చేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో నెల్లూరుజిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కూడా పాల్గొన్నారు. జిల్లా పరిస్థితులపై ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.
