నెల్లూరు సిటీని అభివృద్ధి పథంలో నడుపుదాం… కౌన్సిల్ సమావేశంలో మేయర్

Clock Of Nellore ( Nellore ) – జిల్లాకు చెందిన అందరు ప్రజా ప్రతినిధుల సహకారంతో, నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల పర్యవేక్షణలో నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. మేయర్ స్రవంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో 68 మెయిన్ అజెండా, 15 సప్లిమెంటరీ అజెండా, 8 టేబుల్ అజెండాలుగా మొత్తం ప్రవేశపెట్టిన 91 తీర్మానాలను అజెండాగా ప్రకటించగా, అందులో 2 వాయిదా పడగా, 89 తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులు ప్రణాళికాబద్ధంగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. కార్పొరేషన్ కమిషనర్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో పాటు నగర ప్రజలందరి సహకారంతో నెల్లూరు నగర పాలక సంస్థ ఉన్నతి సాధించేలా సమన్వయంగా కృషి చేస్తామని మేయర్ ఆకాంక్షించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు తమ డివిజన్ల పరిధిలో ప్రస్తావించిన పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైను కాలువల పూడికతీత, దోమల నిర్మూలన, కుక్కలు, పందులు, పశువుల నియంత్రణతో పాటు స్థానిక సమస్యలను, వివిధ అంశాలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని మేయర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు , నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ సూర్య తేజ, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Read Previous

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోండి : ప్రపంచ కిడ్నీ దినోత్సవంలో అపోలో వైద్యుల పిలుపు

Read Next

గొప్ప పర్యాటక ప్రదేశంగా బారాషహీద్ దర్గా : ఆర్చ్ ల నిర్మాణానికి కలెక్టర్ శ్రీకారం

Leave a Reply

Your email address will not be published.