
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో మహిళలకు ఉచితంగా గర్భాశయ ముఖ ద్వారపు క్యాన్సర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధురెడ్డి వెల్లడించారు. సామాజిక బాధ్యతలో భాగంగా క్యాన్సర్ పై అవగాహాన, నివారణే లక్ష్యంగా మెడికవర్ హాస్పిటల్స్ దేశ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అందులో భాగంగా ఈ జనవరి నెలను సర్వైకల్ క్యాన్సర్ అవగాహన నెలగా పాటిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఈనెల 31వ తేదీ వరకూ 5100/- రూపాయల విలువైన సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. దీనికి సంభందించిన పోస్టర్ ను గురువారం కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వారి నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మెడికవర్ హాస్పిటల్ బృందాన్ని అభినందించారు. మంచి కార్యక్రమం చేపట్టారంటూ కొనియాడారు.
అనంతరం డాక్టర్ బింధురెడ్డి మీడియాతో మాట్లాడుతూ 25 ఏళ్ల వయస్సు నుండి 65 ఏళ్ల మహిళలకు గర్భాశయ ముఖ ద్వారపు క్యాన్సర్ ( సర్వైకల్ క్యాన్సర్ ) వచ్చే అవకాశం ఉందన్నారు. దుర్వాసనతో కూడిక వైట్ డిశ్చార్జ్ అవుతున్నా, క్రమం లేకుండా రుతు క్రమం అవుతున్నా అది సర్వైకల్ క్యాన్సర్ లక్షణంగా పరిగణించి వెంటనే వైద్యులను సంప్రదించి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే చికిత్స ద్వారా నివారణ సాధ్యమని డాక్టర్ బింధు రెడ్డి వెల్లడించారు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా టీకా కూడా అందుబాటులో ఉందని చెప్పారు. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ పై మహిళలు అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో ఈనెల 31 వరకూ మహిళలకు ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ వద్ద అన్నీ రకాల క్యాన్సర్ల చికిత్సకు అవసరమైన అధునాతన వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని డాక్టర్ బింధురెడ్డి పేర్కొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెంండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ సతీష్ బాబు, పిఆర్వో చందు వర్మ, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తనయుడు డాక్టర్ అర్జున్ రెడ్డి, టిడిపి నేత రవీంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.