Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని రామలింగాపురం వద్ద మినీ బైపాల్ లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ వంతెన పనులను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ గురువారం పరిశీలించారు. వంతెనపై జరుగుతున్న స్లాబ్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం నగరంలోని విఆర్సీ మైదానంలో శుక్రవారం నుండి మూడు రోజుల పాటూ జరగనున్న కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను కమిటి సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు కర్తం ప్రతాప్ రెడ్డి, నేతలు గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి, నేతాజి సుబ్బారెడ్డి, వావిలేటి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
